User Rating: / 0
PoorBest 

నాగార్జున తనయుడు నాగచైతన్య, రాధ కుమార్తె కార్తీకలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై వాసూవర్మ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ‘జోష్‌’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్‌ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ ‘‘మా సంస్థ నుంచి వస్తున్న 9వ చిత్రమిది.

ఆరు నెలల క్రితం ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 12న విడుదల చేయాలని అనుకున్నాం. కాని సాంకేతికంగా ఇంకా మెరుగ్గా రావాలనే ఉద్ధేశ్యంతో కొంచెం ఆలస్యం అయినా నాగార్జున పుట్టిన రోజు ఆగస్ట్‌ 29న విడుదల చేయాలనుకున్నాం. కాని మేము అనుకున్న క్వాలిటీతో ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా చిత్రానికి నాగార్జునగారే మొదటి ప్రేక్షకుడు. ఆయన సినిమా చూసి ‘చాలా బాగుంది, ఇప్పుడు ‘సంతోషం’గా నిద్రపోతాను’ అనడం మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది.

ఈ సందర్భంగా ఆయనకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దర్శకుడు వాసూవర్మ చెప్పిన దానికంటె చాలా బాగా తీసాడు. నా గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో పాటలు కొంచెం స్లోగా వున్నాయని విన్నాను. కాని ఇందులో అన్ని పాటలు సందర్భానుసారం వస్తాయి. సినిమా విడుదలైతే పాటలు మరింత పాపులర్‌ అవుతాయి’’ అన్నారు.

RELATED ARTICLES:

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://www.teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details